Pahalgham Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. నేటి ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌లో నో చీర్ లీడర్స్

Pahalgham Attack No Cheerleaders at Todays IPL Match

  • నేడు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్
  • పహల్గాం ఉగ్రదాడి బాధితులకు బీసీసీఐ సంఘీభావం ప్రకటన
  • నల్ల బ్యాడ్జ్‌లు ధరించి బరిలోకి ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు
  • మ్యాచ్‌కు ముందు నిమిషం మౌనం

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌), ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. నిన్న పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.

ఈ నిర్ణయంలో భాగంగా, నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల ఆటగాళ్లతో పాటు ఫీల్డ్ అంపైర్లు కూడా నల్ల బ్యాడ్జ్‌లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా, మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోని ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకులతో సహా అందరూ ఒక నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించనున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, నేటి మ్యాచ్‌లో ఛీర్‌లీడర్స్‌ను అనుమతించడం లేదని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.

2019 పుల్వామా దాడి అనంతరం జరిగిన 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ఆ వేడుకలకు కేటాయించిన నిధులను ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల సంక్షేమానికి విరాళంగా అందించింది.

పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య వంటి క్రీడాకారులు సోషల్ మీడియా ద్వారా బాధితులకు తమ మద్దతును, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ఘటనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా స్పందించింది. ‘‘పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Pahalgham Terrorist Attack
IPL 2025
Sunrisers Hyderabad
Mumbai Indians
Uppsala Stadium
No Cheerleaders
BCCI
Virat Kohli
Hardik Pandya
Terrorism
  • Loading...

More Telugu News