Pawan Kalyan: పహల్గామ్ ఉగ్ర‌దాడి తీవ్రంగా క‌లిచివేస్తోంది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

Pawan Kalyan Condemns Pahalgham Terrorist Attack

  • ఉగ్ర‌దాడిలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు జ‌న‌సేనాని ప్రగాఢ‌ సానుభూతి
  • వారి గౌర‌వార్థం జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలు
  • మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో పార్టీ జెండా అవ‌న‌తం

పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఈ దాడిలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు సానుభూతి తెలుపుతూ జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంద‌ని తెలిపారు. 

"పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి తీవ్రంగా క‌లిచివేస్తోంది. ఈ దాడిలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా. వారి గౌర‌వార్థం జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. మా పార్టీ జెండాను అవ‌న‌తం చేస్తున్నాం.

ఈ క్లిష్ట స‌మ‌యంలో ఐక్యంగా ఉందాం. మ‌న భార‌త ఐక్య‌త‌ను ఏ ఉగ్ర‌వాదం విచ్ఛిన్నం చేయ‌లేదు. ఇలాంటి దారుణాలు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూడాలి. స‌మష్టిగా మ‌నం దీన్ని అధిగ‌మిద్దాం... క‌లిసిక‌ట్టుగా ఉందాం. ఎప్ప‌టికైనా న్యాయ‌మే గెలుస్తుంది" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో పార్టీ జెండాను అవ‌న‌తం చేశారు.  

Pawan Kalyan
Pahalgham Terrorist Attack
Janasena Party
Andhra Pradesh
Telangana
Condolence
India
Terrorism
Deputy CM
  • Loading...

More Telugu News