Mahesh Babu: ఈ క్రూర దాడికి వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి: మహేశ్ బాబు

Mahesh Babu Condemns Pahalgam Terrorist Attack

  • పహల్గామ్‌ ఉగ్రదాడిపై మహేశ్ బాబు ఆవేదన
  • దేశ చరిత్రలో చీకటిరోజు అని వ్యాఖ్య
  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మహేశ్

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్‌ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు అని చెప్పారు. ఇలాంటి క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మనమందరం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే పలువురు సినీ స్టార్లు ఖండించారు.

Mahesh Babu
Pahalgam Terrorist Attack
Jammu and Kashmir
Terrorism
India
Bollywood Celebrities
Condemnation
Superstar Mahesh Babu
Tragedy
  • Loading...

More Telugu News