Mahesh Babu: ఈ క్రూర దాడికి వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి: మహేశ్ బాబు

- పహల్గామ్ ఉగ్రదాడిపై మహేశ్ బాబు ఆవేదన
- దేశ చరిత్రలో చీకటిరోజు అని వ్యాఖ్య
- మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మహేశ్
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు అని చెప్పారు. ఇలాంటి క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మనమందరం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే పలువురు సినీ స్టార్లు ఖండించారు.