Pahalgam Terrorist Attack: పహల్గాంలో ఉగ్రదాడి.. విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చేశారు!

Visakhapatnam Man Killed in Pahalgam Terrorist Attack

      


జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి మృతిచెందారు. పారిపోతున్న ఆయ‌న్ను వెంబడించి మరీ కాల్చి చంపినట్లు స‌మాచారం. చంపొద్ద‌ని వేడుకున్నా ఉగ్ర‌మూక‌లు ఈ ఘాతుకానికి పాల్ప‌డినట్లు తెలుస్తోంది. చంద్ర‌మౌళి మృతదేహాన్ని స‌హ‌చ‌ర టూరిస్ట్‌లు గుర్తించారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే విశాఖ నుంచి కుటుంబస‌భ్యులు పహల్గాంకు బయలుదేరి వెళ్లారు. కాగా, ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా... మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం.  

Pahalgam Terrorist Attack
Chandra Mouli
Jammu and Kashmir Terrorist Attack
Visakhapatnam Resident Killed
India Terrorist Attack
Retired Bank Employee
Tourist Killed in Pahalgam
Pahalgam Attack Victims
  • Loading...

More Telugu News