TRF: జమ్మూ కశ్మీర్ లో దాడికి పాల్పడింది మేమే: టీఆర్ఎఫ్

TRF Claims Responsibility for Pahalgham Attack

  • పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి
  • ఘటనలో 20 మందికి పైగా మృతి
  • లష్కరే తోయిబా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న టీఆర్ఎఫ్!

జమ్మూ కాశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.  ఈ దాడిలో 20 మందికి పైగా మరణించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్టు సమాచారం. 

కాగా, ఈ క్రూరమైన దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ప్రకటించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 ఆగస్టులో ఈ సంస్థ వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానికంగా వెన్నుదన్ను ఇచ్చేందుకు ఏర్పడినట్టు భావిస్తున్నారు. 

TRF
Jammu and Kashmir Terrorist Attack
Pahalgham Attack
Terrorism in Kashmir
Resistance Front
Article 370
Kashmir Tourism
Pakistan-sponsored Terrorism
LeT
Anantnag
  • Loading...

More Telugu News