Mumbai Indians: టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్... సీఎస్కేపై చేజింగ్ చేయగలదా?

- ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
- రెండో మ్యాచ్ లో ముంబయి × చెన్నై
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఛేజింగ్ చేయడానికే మొగ్గుచూపింది.
ఈ మ్యాచ్ కోసం ఎంఐ ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. సీఎస్కే టీమ్ లో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠీ స్థానంలో ఆయుష్ మాత్రే తుదిజట్టులోకి వచ్చాడని తెలిపాడు.
టోర్నీలో ఇప్పటివరకు సీఎస్కే 7 మ్యాచ్ లు ఆడి 5 ఓటములతో పాయింట్ల పట్టికలో అందరికంటే అట్టడుగున ఉంది. అయితే గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలవడం చెన్నై జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.