Narayana: రేపు, ఎల్లుండి గుజరాత్ లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన

- రెండ్రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్న మంత్రి నారాయణ, అధికారులు
- అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనం
- పలు ప్రదేశాలను సందర్శించనున్న మంత్రి నారాయణ బృందం
ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు అధికారులు రేపు, ఎల్లుండి గుజరాత్ లో పర్యటించనున్నారు. మంత్రి నారాయణ, ఆయన బృందం అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనానికి వెళుతున్నారు. మంత్రి నారాయణ వెంట సీఆర్డీఏ కమిషనర్, ఏడీసీ, గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఏప్రిల్ 20న మంత్రి నారాయణ బృందం ఏక్తానగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించనుంది. పటేల్ విగ్రహం పరిసర ప్రాంతాలను మంత్రి బృందం అధ్యయనం చేయనుంది. అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీని పరిశీలించనున్నారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించనున్నారు.
అనంతరం, రేపు రాత్రి అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ సిటీని పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ బృందం ఎల్లుండి ఏప్రిల్ 21న సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించనుంది.