Shreya Keserwani: ప్రేమ పెళ్లిళ్లపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

- తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్న జంట
- ఆ ఒక్క కారణాన్ని చూపించి రక్షణ కోరడం సరికాదన్న కోర్టు
- నిజంగా ముప్పు ఉందని భావిస్తే తామే రక్షణ కల్పిస్తామన్న న్యాయస్థానం.. పిటిషన్ కొట్టివేత
ప్రేమ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంట కేవలం ఆ ఒక్క కారణాన్ని చూపించి రక్షణ కోరలేరని స్పష్టం చేసింది. వారి జీవితానికి, స్వేచ్ఛకు నిజంగానే ముప్పు ఉంటే తప్ప వారికి భద్రత కల్పించలేమని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయ కేసర్వానీ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో పెద్దల నుంచి తమకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించడంతోపాటు తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని భర్తతో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదని, కాబట్టి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారికి నిజంగా ముప్పు ఉందని భావిస్తే తామే రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. సమాజాన్ని ఎదుర్కోవడం కోసం దంపతులిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయ కేసర్వానీ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో పెద్దల నుంచి తమకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించడంతోపాటు తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని భర్తతో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదని, కాబట్టి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారికి నిజంగా ముప్పు ఉందని భావిస్తే తామే రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. సమాజాన్ని ఎదుర్కోవడం కోసం దంపతులిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.