Anna Lezhneva: శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ అర్ధాంగి అన్నా లెజినోవా

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఆదివారం రాత్రే తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా... వెంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె స్వామివారి దర్శనానికి వచ్చారు.