Abhishek Sharma: పంజాబ్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ రికార్డుల హోరు

- ఐపీఎల్లో అభిషేక్ శర్మ రికార్డు స్కోరు
- అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఇండియన్గా రికార్డు
- ఈ ఐపీఎల్లో అత్యంత భారీ సిక్సర్ బాదిన అభిషేక్
ఐపీఎల్లో భాగంగా గత రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శతకం బాదిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఈ మ్యాచ్లో 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో అభిషేక్ 141 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక ఛేజింగ్ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో అభిషేక్ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఇండియన్గానూ అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. అలాగే ఈ ఐపీఎల్లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. పదో ఓవర్లో పంజాబ్ ఆల్రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపి రికార్డులకెక్కాడు.