Turaka Kishore: పిన్నెల్లి ప్రధాన అనుచరుడిపై పీడీ యాక్ట్

PD Act Registered Against Pinnellis Close Aide

  • రెండు కేసుల్లో నెల్లూరు సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న తురకా కిశోర్
  • పీడీ యాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ 
  • కిశోర్‌ను నెల్లూరు సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన అధికారులు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ సీనియర్ నేత తురకా కిషోర్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నల కారుపై దాడి చేసిన కేసులోనూ కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. 2020 డిసెంబర్‌లో మాచర్ల టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టి, కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన ఘటనలోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ రెండు కేసుల్లో ప్రస్తుతం ఆయన నెల్లూరు సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎన్నికల ఫలితాల అనంతరం పరారీలో ఉండగా, గత ఏడాది డిసెంబర్ 26న హైదరాబాద్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో నెల్లూరు సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

Turaka Kishore
PD Act
Pinnelli Ramakrishna Reddy
Macharla
YCP
TDP
Bonda Uma
Buddha Venkanna
Andhra Pradesh Politics
Criminal Case
  • Loading...

More Telugu News