Donald Trump: ట్రంప్ సంకేతాలతో భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

- టారిఫ్ ల విషయంలో చర్చలకు సిద్ధమన్న ట్రంప్
- రాణించిన ఆసియా మార్కెట్లు
- లాభాలతో ప్రారంభమైన యూరోపియన్ మార్కెట్లు
- 1,089 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 374 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
నిన్న భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అదే స్థాయిలో పుంజుకున్నాయి. టారిఫ్ ల విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలకు సిద్ధమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలతో అన్ని ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా రాణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 1,600 పాయింట్లకు పైగా లాభపడింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,089 పాయింట్ల లాభంతో 74,227 వద్ద ముగిసింది. నిఫ్టీ 374 పాయింట్లు లాభపడి 22,535 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
టైటాన్ (3.29%), బజాజ్ ఫైనాన్స్ (3.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.00%), ఎల్ అండ్ టీ (2.94%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.75%), యాక్సిస్ బ్యాంక్ (2.72%), జొమాటో (2.62%).
సెన్సెక్స్ లో కేవలం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మాత్రమే (-0.14%) నష్టపోయింది.
యూరోపియన్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలరుతో అమెరికా మారకం విలువ రూ. 86.27గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.