Samantha: హెచ్‌సీయూ వివాదంపై సమంత ఏమ‌న్నారంటే...!

Samanthas Stand on HCU Land Dispute

  • కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద నిర‌స‌న‌లు
  • ఈ వివాదంపై ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల స్పంద‌న‌
  • తాజాగా ఈ వ్య‌వ‌హారంపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక స‌మంత పోస్ట్

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద గ‌త రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్ప‌టికే ఈ వివాదంపై ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు స్పందించారు. ఈ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ న‌టి రేణు దేశాయ్ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఈ వివాదంపై ఇప్ప‌టికే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్, డైరెక్ట‌ర్‌ త‌రుణ్ భాస్క‌ర్, న‌టుడు ప్రియ‌ద‌ర్శి, ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌, యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్, ఈషా రెబ్బా త‌దిత‌రులు కూడా స్పందించారు. 

తాజాగా ఈ వివాదంపై న‌టి స‌మంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. హెచ్‌సీయూ 400 ఎక‌రాల క‌థ‌నంపై ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక తెలంగాణ టుడేలో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన స‌మంత... కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ నినదించారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ వేదిక‌గా Change.org (సామాజిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించే సంస్థ‌) పిటిష‌న్‌కి సైన్ చేయాల‌ని కోరారు.

Samantha
HCU Land Issue
Kanchanbagh Land Dispute
Hyderabad Central University
Telangana Today
Student Protest
Tollywood Celebrities
Change.org Petition
Nag Ashwin
Tarun Bhaskar
  • Loading...

More Telugu News