Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం

Telangana Forms SIT to Probe Betting App Case

  • ఐదుగురితో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు 
  • సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు
  • సిట్ ప్ర‌ధాన అధికారిగా ఐజీ ర‌మేశ్ నియామ‌కం
  • స‌భ్యులుగా సింధు శ‌ర్మ‌, వెంక‌ట‌ల‌క్ష్మీ, చంద్ర‌కాంత్‌, శంక‌ర్ 

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సిట్ ప్ర‌ధాన అధికారిగా ఐజీ ర‌మేశ్‌ను నియ‌మించారు. ఇందులో స‌భ్యులుగా ఎస్‌పీలు సింధు శ‌ర్మ‌, వెంక‌ట‌ల‌క్ష్మి, అద‌నపు ఎస్‌పీలు చంద్ర‌కాంత్‌, శంక‌ర్ ఉన్నారు. 

ఇక బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే పంజాగుట్ట‌తో పాటు సైబ‌రాబాద్‌, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ల‌లో 25 మంది సెల‌బ్రిటీల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం ఇప్పుడు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిపై నెల‌న్న‌ర రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని డీజీపీ జితేంద‌ర్... సిట్‌ను ఆదేశించారు. 

Betting Apps Case
Jithender Reddy
Telangana SIT
Betting Apps Investigation
Cyberabad Police
Celebrity Arrests
Illegal Betting
IG Ramesh
SP Sindhu Sharma
Telangana Government
Crime Investigation
  • Loading...

More Telugu News