Nandamuri Balakrishna: ఆ పురస్కారం సరైన సమయంలో వచ్చిందనుకుంటున్నా: బాలకృష్ణ

Balakrishnas Padma Bhushan It Came at the Right Time

  • ఏప్రిల్ 4న ఆదిత్య 369 రీ రిలీజ్ 
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పద్మభూషణ్ పురస్కారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ
  • అన్ని వర్గాలను అలరించేలా సినిమాలు చేస్తున్నట్లు వెల్లడి

సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. ఈ పురస్కారంపై బాలకృష్ణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆదిత్య 369 చిత్రం ఏప్రిల్ 4న పునః విడుదల కానున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ప్రసంగించారు. చిత్ర పరిశ్రమలో నటుడిగా, రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఓటీటీ వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా  సేవలు అందిస్తున్న బాలకృష్ణ అనేక విషయాలను ఈ సందర్భంగా వివరించారు. పద్మభూషణ్ పురస్కారం ఆలస్యంగా వచ్చిందని చాలామంది అంటున్నారని, కానీ సరైన సమయానికే వచ్చిందని పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తున్నానని ఆయన అన్నారు. ఆదిత్య 369 లాంటి సినిమాను రూపొందించాలని చాలామంది ప్రయత్నించారని, కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరికొన్ని ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని అందించగలిగామని పేర్కొన్నారు. 

Nandamuri Balakrishna
Padma Bhushan Award
Aditya 369 Re-release
Tollywood Actor
Andhra Pradesh MLA
Indian Cinema
Telugu Movies
Balakrishna Interview
Film Re-release
  • Loading...

More Telugu News