YS Jagan: తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందికీ ఉగాది శుభాకాంక్షలు
- అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా ఆ భగవంతుడు చూడాలన్న జగన్
- ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
కాగా, ఈరోజు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ ఉగాది వేడుకల్లో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.