Gujarat Titans: రాణించిన టాపార్డర్... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

- అహ్మదాబాద్ లో నేడు ముంబయి ఇండియన్స్ × గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసిన గుజరాత్
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో టాపార్డర్ రాణించడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 38, జోస్ బట్లర్ 39 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో షెర్ఫాన్ రూథర్ ఫర్డ్ 18 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రా పేస్ బౌలర్ సత్యనారాయణరాజు ఏమంత ఆకట్టుకోలేకపోయాడు. భారీగా వైడ్లు వేయడమే కాకుండా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లు వేసిన సత్యనారాయణరాజు 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
ముంబయి బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ట్రెంట్ బౌల్ట్ 1, దీపక్ చహర్ 1, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.