Chandrababu Naidu: విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు... హాజరైన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu attends Iftar in Vijayawada

  • కొనసాగుతున్న రంజాన్ మాసం
  • విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
  • ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు
  • ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని హామీ

ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని హామీ ఇచ్చారు. పేదలతో నేనుండాలనేదే నా జీవితాశయం అని స్పష్టం చేశారు. పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకే ఈ నెల 30న పీ4 అమలుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

Chandrababu Naidu
Iftar Party
Vijayawada
Muslims
Andhra Pradesh
Ramadan
Namaz
Welfare Schemes
P4 Program
Wakf Board
  • Loading...

More Telugu News