Chandrababu Naidu: విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు... హాజరైన సీఎం చంద్రబాబు

- కొనసాగుతున్న రంజాన్ మాసం
- విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
- ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు
- ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని హామీ
ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని హామీ ఇచ్చారు. పేదలతో నేనుండాలనేదే నా జీవితాశయం అని స్పష్టం చేశారు. పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకే ఈ నెల 30న పీ4 అమలుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.



