Malla Reddy: మాకు దిష్టి తగిలింది అధ్యక్షా..!: మల్లారెడ్డి

Malla Reddys Hilarious Speech in Telangana Assembly

  • శాసనసభలో నవ్వులు పూయించిన మల్లారెడ్డి
  • దిష్టి తగిలి తమ జిల్లాలోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలు అయ్యాయని వ్యాఖ్య
  • తమను జీహెచ్ఎంసీలో కలపొద్దని విన్నపం

తన పంచ్ డైలాగులు, వ్యవహారశైలితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఈరోజు శాసనసభలో ఆయన నవ్వులు పూయించారు. సభలో ఆయన మాట్లాడుతూ... "అధ్యక్షా, ప్రభుత్వానికి నేను రెండు విషయాలను చెప్పాలనుకుంటున్నా. ఒకటి ప్రభుత్వానికి రూ. 11 వందల కోట్లు వచ్చే విషయం. మరొకటి మా మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచ్ లు, కౌన్సిలర్ల బాధలు" అని చెప్పారు. దీంతో స్పీకర్ కలగజేసుకుని రెండు వద్దు ఒకటే చెప్పాలని సూచించారు.

స్పీకర్ సూచనతో మాట్లాడటం మొదలుపెట్టిన మల్లారెడ్డి... తమ మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది అధ్యక్షా అని అన్నారు. దీంతో, సభలో నవ్వులు విరబూశాయి. ఏం దిష్టి తగిలిందో కానీ... జిల్లాలోని గ్రామాలన్నీ పోయి మున్సిపాలిటీలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమను జీహెచ్ఎంసీలో కలపొద్దని కోరారు. అనంతరం ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతానంటూ మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయనకు స్పీకర్ అనుమతిని ఇవ్వలేదు. 

Malla Reddy
BRS MLA
Telangana Assembly
Medchal
GHMC
Municipalities
Telangana Politics
Funny Speech
Assembly Session
  • Loading...

More Telugu News