Marriage Cancellation: పెళ్లి కావడంలేదని సికింద్రాబాద్ లో యువ వైద్యుడి బలవన్మరణం

Young Doctor Ends Life After Marriage Fails

  • రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
  • ఇటీవలే నిశ్చితార్థం.. బట్టతల ఉందనే కారణంతో రద్దు
  • తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతున్నా కుదరడంలేదని మనస్తాపం

వయసు మీద పడుతున్నా వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ కు చెందిన ప్రకాష్‌ మాల్‌ కుటుంబంతో సహా సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. ఆయన చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పురోహిత్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు.

అయితే, పురోహిత్ కు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల అమ్మాయి కుటుంబం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో పురోహిత్ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతుకుతున్నారు. సరైన సంబంధం దొరకడం లేదు. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చాయని, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దయిందని పురోహిత్ మనస్తాపం చెందాడు. ఈ ఆవేదనతో బుధవారం ఉదయం బొల్లారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. గుర్తింపు కార్డులోని చిరునామా ఆధారంగా పురోహిత్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

Marriage Cancellation
Doctor Suicide
Purohit Kishor
Secunderabad
Railway Track Suicide
Balavanmaranam
Andhra Pradesh
India
Mental Health
Family Pressure
  • Loading...

More Telugu News