Explosion: చెత్త ఎత్తుతుండగా పేలుడు, కుషాయిగూడలో కార్మికుడు మృతి.. వీడియో ఇదిగో!

Worker Dies in Kushaiguda Explosion During Waste Disposal

––


మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కుషాయిగూడ పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం చెత్త కుప్పలో పేలుడు సంభవించింది. ఓ కార్మికుడు ట్రాక్టర్ లోకి చెత్త ఎత్తుతుండగా అకస్మాత్తుగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. నాగరాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక దర్యాఫ్తులో పేలుడుకు కారణం కెమికల్స్ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కెమికల్స్ అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు వేశారనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News