NMD Farooq: ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఇంట్లో తీవ్ర విషాదం

- మంత్రి ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూత
- తీవ్ర అనారోగ్యంతో మృతి
- రేపు నంద్యాలలో అంత్యక్రియలు
ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షహనాజ్ కొంతకాలంగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తిరిగి కోలుకోలేకపోయారు. ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాల తరలిస్తున్నారు. శనివారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.