AP Assembly: కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక కమిటీల ఏర్పాటు

- 2025-26 అసెంబ్లీ కమిటీల ప్రకటన
- ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులు
- ఏడాదిపాటు పనిచేయనున్న కమిటీలు
- అసెంబ్లీ రూల్స్ కమిటీ ఛైర్మన్గా అయ్యన్నపాత్రుడు
- పిటిషన్ల కమిటీ ఛైర్మన్గా రఘురామకృష్ణంరాజు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే కీలక కమిటీల నియామకం చేపట్టారు. 2025-26 అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు ఏడాదిపాటు పనిచేయనున్నాయి.
అసెంబ్లీ రూల్స్ కమిటీ ఛైర్మన్గా అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ ఛైర్మ్గా మండలి బుద్ధ ప్రసాద్, ప్రివిలేజెస్ కమిటీ ఛైర్మన్గా పితాని సత్యనారాయణ, పిటిషన్ల కమిటీ ఛైర్మన్గా రఘురామకృష్ణంరాజు మితులయ్యారు.