Vishnupriya: విష్ణుప్రియ సహా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు

- బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసుల నజర్
- ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు
- తాజాగా విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు సెలబ్రిటీలకు నోటీసులు
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన మరికొందరిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.