MS Dhoni: సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో ఎంఎస్ ధోనీ... నెట్టింట వీడియో వైరల్!

- ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన కోసం ధోనీని డైరెక్ట్ చేసిన సందీప్రెడ్డి వంగా
- ఆ యాడ్ తాలూకు ప్రోమో వీడియోలు వైరల్
- యానిమల్ సినిమాలో హీరో రణబీర్ క్యారెక్టర్లో అదరగొట్టిన ఎంఎస్డీ
తెలుగు దర్శకుడు సందీప్రెడ్డి వంగా 'యానిమల్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లతో సాండీ స్థాయిని అమాంతం పెంచేసింది. దీంతో ఆయన ప్రభాస్తో తీయబోయే 'స్పిరిట్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలాఉంటే.. సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ నటించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన తాలూకు వీడియో అది. వీడియోలో 'యానిమల్' సినిమాలో హీరో రణబీర్ క్యారెక్టర్లో ధోనీ సైకిల్పై రావడాన్ని సందీప్రెడ్డి చిత్రీకరించడం మనం చూడొచ్చు.
కాగా, ఈ యాడ్కు సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఎంఎస్డీ, సాండీ కాంబోలోని యాడ్ తాలూకు ప్రోమోపై మీరు కూడా ఒక లుక్కేయండి.