Namrata Shirodkar: విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత

Namrata Shirodkar inaugurates Mothers Milk Bank in Vijayawada

 


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ నేడు విజయవాడలో పర్యటించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ఆమె ప్రారంభించారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ బ్యాంకు ప్రాజెక్టుకు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నిధులు సమకూర్చింది. 

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ, అనేక సందర్భాల్లో శిశువులకు తల్లి పాలు అందక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అలాంటి వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. 

ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ రమణమూర్తి మాట్లాడుతూ... మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ను నివారించే వ్యాక్సిన్ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ తో కలిసి కృషి చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News