SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఎట్టకేలకు ఒక మృతదేహం వెలికితీత

- గత నెల 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
- 8 మంది గల్లంతు
- 16 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదం జరిగిన 16 రోజులకు ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం బాగా కుళ్లిపోయి నుజ్జునుజ్జయిన స్థితిలో ఉంది. ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని భావిస్తున్నారు.
అయితే, అతడి కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాత ఓ నిర్ధారణకు రానున్నారు. కాగా, మృతుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ నుంచి వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.