SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ ప్రమాదం.. కార్మికుల ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు

Kerala dogs find human traces in SLBC project

  • గత నెల 22న కుప్పకూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్
  • సహాయక చర్యల్లో భాగంగా కేరళ నుంచి జాగిలాలు తెప్పించిన అధికారులు
  • నేటి సాయంత్రానికి కార్మికులను గుర్తించే అవకాశం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగం కూలడంతో అందులో పేరుకుపోయిన మట్టిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలోని డీ-2 పాయింట్‌లో గల్లంతైన వారి ఆనవాళ్లను జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.

ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. 

SLBC Tunnel
Kerala Dogs
Human Traces
  • Loading...

More Telugu News