GHMC: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి అధికారి పాదపూజ

- కాప్రా సర్కిల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- కార్మికులకు పాదపూజ చేసిన పర్యవేక్షణ అధికారి సుదర్శన్
- మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ ఆటపాటలతో సందడి
తెలంగాణలోని హైదరాబాద్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఒక అధికారి పాదపూజ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పర్యవేక్షణ అధికారి సుదర్శన్ సన్మానం చేశారు. అనంతరం, కార్మికురాలి పాదాలను కడిగి పూలుజల్లి పాదపూజ చేశారు. మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు, కార్మికులు ఆటపాటలతో సందడి చేశారు.