BEd Paper Leak: ఏఎన్ యూ బీఎడ్ ప్రశ్నాపత్నం లీక్... పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

Police probe starts in ANU BEd Paper Leak Case

  • నిన్న బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్
  • వెంటనే పరీక్షను రద్దు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ముగ్గురు నిందితులు ఒడిశాకు చెందినవారిగా గుర్తింపు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో నిన్న ప్రశ్నాపత్రం లీక్ కావడం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్పరీక్ష జరగాల్సి ఉండగా... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ బయటికొచ్చింది. దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, పరీక్షను రద్దు చేశారు. 

కాగా, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేపర్ లీక్ తో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు నిందితులును అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.

BEd Paper Leak
ANU
Police
  • Loading...

More Telugu News