Visakhapatnam: విశాఖ కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం

- పాత టైర్లకు, చెత్తకు మంట పెట్టడంతో వ్యాపించిన మంటలు
- భయాందోళనకు గురైన వ్యాపారులు, పర్యాటకులు
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం సంభవించింది. పాత టైర్లకు, చెత్తకు మంట పెట్టడంతో మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వ్యాపారులు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ట్రాక్ మధ్యలో అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్లో ట్రాక్ పొడవునా ఉన్న ఎండు మొక్కలకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. రైల్వే కానిస్టేబుల్, సిబ్బంది బకెట్లలో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.