Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

- రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం
- న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
- కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ముసాయిదా బిల్లుకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.