South Central Railway: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో లైన్ పనులు.. నేటి నుంచి పలు రైళ్ల రద్దు

South Central Railway Cancels Several Trains

  • నేటి నుంచి ఈ నెల 13 వరకు పలు రైళ్ల రద్దు
  • మరికొన్ని దారి మళ్లింపు, ఇంకొన్ని పాక్షికంగా రద్దు
  • ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే అధికారులు

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. గుంటూరు, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి సహకరించాలని కోరారు. 

దారి మళ్లించిన రైళ్లలో విశాఖ-న్యూఢిల్లీ, విశాఖ-గాంధీధామ్, హైదరాబాద్-షాలీమార్, ముంబై-భువనేశ్వర్, షిర్డీ-కాకినాడ, షిర్డీ-మచిలీపట్నం, ఎర్నాకుళం-బరౌనీ రైళ్లు ఉన్నాయి. అలాగే, రద్దయిన రైళ్లలో డోర్నకల్-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ఇండోర్-కొచ్చివెల్లి, కోర్బా-తిరువనంతపురం, గోరఖ్‌పూర్-కొచ్చివెల్లి, హిస్సార్-తిరుపతి రైళ్లు ఉన్నాయి. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైళ్లను రేపటి నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేశారు.

గమనిక: రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లించిన వాటిలో తిరుగు ప్రయాణ రైళ్లు కూడా ఉన్నాయి. అత్యవసర సమాచారం కోసం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో సంప్రదించవచ్చు.

South Central Railway
Khammam Division
Mahabubabad District
  • Loading...

More Telugu News