Chandrababu: చంద్రబాబు నాయుడును కలిసిన పీటీ ఉషా

PT Usha meets AP CM Chandrababu Naidu

  • 2029లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని కోరిన సీఎం
  • క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు వెల్లడి
  • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రం కోసం మద్దతు కోరినట్లు తెలిపిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష సమావేశమయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆమెను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు.

ఉండవల్లిలోని తన నివాసంలో పీటీ ఉషతో నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు ముఖ్యమంత్రి 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకురావడంలో పీటీ ఉష సహకారం కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu
PT Usha
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News