KCR: తెలంగాణ ప్రజలపై శివుడి దీవెనలు ఉండాలి: కేసీఆర్ శివరాత్రి శుభాకాంక్షలు

KCR wishes Telangana people on Shviarathri fest

  • ముల్లోకాలను కాపాడుతున్న శివుడి కరుణా కటాక్షాలు తెలంగాణ మీద ఉండాలన్న కేసీఆర్
  • ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని ప్రార్థించిన కేసీఆర్
  • కేటీఆర్, హరీశ్ రావు పండుగ శుభాకాంక్షలు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు ఆ అర్ధ నారీశ్వరుడి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. శివరాత్రి పండుగ సందర్భంగా శివభక్తులు ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరించడం మన హిందూ సంప్రదాయం ప్రత్యేకత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మోరుమోగుతాయని ఆయన అన్నారు.

గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ శివుడి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ప్రార్థించారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. 

"ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా శివుడిని కొలిచే పర్వదినం మహా శివరాత్రి. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూ సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

పరమశివుని ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

KCR
Shivaratri
Telangana
Harish Rao
KTR
  • Loading...

More Telugu News