Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన ఆసీస్

Aussies won the toss and elected bowling first

  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా × ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 12 ఓవర్లలో 2 వికెట్లకు 87 పరుగులు చేసిన ఇంగ్లండ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. చిరకాల ప్రత్యర్థులు అనదగ్గ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు గ్రూప్-బి మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగాయి. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఈ పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10, వన్ డౌన్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు డ్వార్షూయిస్ కు దక్కాయి. 

ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్ (27 బ్యాటింగ్), జో రూట్ (22 బ్యాటింగ్) ఉన్నారు.

Champions Trophy 2025
Australia
England
Lahore
  • Loading...

More Telugu News