Janamloki Janasena: ఫిబ్రవరి 2న పుంగనూరు నియోజకవర్గంలో జనసేన బహిరంగ సభ

- 'జనంలోకి జనసేన' సభ
- సోమల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సభ
- ముఖ్య అతిథిగా నాగబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 2న 'జనంలోకి జనసేన' బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నియోజకవర్గంలోని సోమల మండలం కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నాగబాబుతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.