Kumbha Mela: మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం

- ప్రయాగ్రాజ్ సెక్టార్ 22లోని ఛట్నాగ్ ఘాట్ వద్ద మంటలు
- కాలిపోయిన 15 గుడారాలు
- ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ సెక్టార్ 22లోని ఛట్నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దాదాపు పదిరోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 18 టెంట్లు కాలిపోయాయి. అంతేకాకుండా, నిన్న జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.