K. Keshava Rao: కేకే కుటుంబానికి హైదరాబాద్‌లో తక్కువ ధరకు భూమిని కేటాయించారంటూ హైకోర్టులో పిటిషన్

Petition in TG HC on regularisation of land to KK family

  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘువీర్ రెడ్డి
  • జీవో నెంబర్ 56 ద్వారా భూమిని క్రమబద్ధీకరించారంటూ పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన ప్రతివాదుల తరపు న్యాయవాదులు

బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో గల భూమిని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు తక్కువ ధరకు కట్టబెట్టారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ భూమిని జీవో నంబర్ 56 ద్వారా కె.కె. కుటుంబానికి క్రమబద్ధీకరించారని రఘువీర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రెవెన్యూ అధికారులు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితలను చేర్చారు.

ఈ భూమిని తక్కువ ధరకు కేటాయించారని, ఈ స్థల కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌‍ పై సీజే ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News