LT2 Empuraan: మోహన్ లాల్ 'L2E ఎంపురాన్' అఫిషియల్ టీజర్ విడుదల

- మోహన్ లాల్ హీరోగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో చిత్రం
- లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న L2E ఎంపురాన్
- గతంలో మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో లూసిఫర్
- ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా L2E ఎంపురాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ చిత్రం ఘనవిజయం అందుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం L2E ఎంపురాన్.
మరోసారి మోహన్ లాల్-సుకుమారన్ కాంబినేషన్ బాక్సాఫీసును ఊపేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ను నేడు కొచ్చిలో విడుదల చేశారు. టీజర్ లో సన్నివేశాలు చూస్తుంటే వేరే లెవల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అని అర్థమవుతోంది. ఎక్కడా రాజీపడకుండా ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
టీజర్ను గమనిస్తే...
ఖురేషి ఉండే టౌన్ నార్త్ ఇరాక్లో విజువల్స్ను చూపించటం ద్వారా టీజర్ మొదలైంది. ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్లందరూ మోసగాళ్లు అనిపించినప్పుడు... ఈ నాన్న లేకుంటే... నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు. అతడే స్టీఫెన్... అనే పవర్ఫుల్ డైలాగ్తో హీరో మోహన్ లాల్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యుద్ధం మంచికి, చెడుకి కాదు.. చెడుకి, చెడుకి మధ్య, అనే మరో డైలాగ్తోపాటు... జగదీష్ స్టీఫెన్ హిందువులకు తను మహిరావణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుస్తారు.. క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది.. లూసిఫర్ అనే డైలాగ్ హీరో ఎంత పవర్ఫుల్లో అనేది ఎలివేట్ చేశారు. హీ ఈజ్ కమింగ్ బ్యాక్ అనే డైలాగ్ తర్వాత మోహన్ లాల్ లుక్ను రివీల్ చేశారు. ఖురేషి అబ్రామ్ అని మోహన్ లాల్ తన మరో పేరుని రవీల్ చేయటం... మిలటరీ వాళ్లు స్టీఫెన్ను టార్గెట్ చేయటం... దిస్ డీల్ విత్ డెవిల్ అని మోహన్ లాల్ చెప్పటం... ఒక్క మాట భాయ్ జాన్, నేను ఎదురు చూస్తున్నాను అని చివరో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పే డైలాగ్... వాటికి అనుగుణంగా వచ్చే విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
నటుడిగా అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం అనగానే... గతంలో అందరూ కాస్త సందేహంగా చూశారు. లూసిఫర్ తిరుగులేని హిట్ అయ్యాక... అతడి డైరెక్షన్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. దాంతో L2E ఎంపురాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
ఇందులో మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు నటించారు.