Padma Shri: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం... రవిచంద్రన్ అశ్విన్‌కు పద్మశ్రీ

Centre announces first list of Padma Shri awardees

  • బ్రెజిల్ వేదాంతగురు జోనస్ మాశెట్టికి పద్మశ్రీ
  • పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్‌ను వరించిన పద్మ
  • నేపాల్ జానపద గాయకుడు బేరు సింగ్ చౌహాన్‌కు పద్మశ్రీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ వచ్చాయి. టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పద్మశ్రీ వరించింది.

  • జోనస్ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్
  • హర్వీందర్ సింగ్ (పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్) - హర్యానా
  • భీమ్ సింగ్ భవేష్ (సామాజిక సేవ) -  బీహార్
  • పి. దక్షిణామూర్తి (డోలు విద్వాంసుడు) - పుదుచ్చేరి
  • ఎల్. హంగ్ థింగ్  (వ్యవసాయం-పండ్లు) - నాగాలాండ్
  • బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
  • షేఖా ఏజే అల్ సబాహ్ (యోగా) - కువైట్
  • నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
  • హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
  • జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త) - అరుణాచల్ ప్రదేశ్
  • విలాస్ దాంగ్రే (హోమియోపతి డాక్టర్) - మహారాష్ట్ర
  • వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
  • నిర్మలాదేవి (చేతివృత్తులు) - బీహార్
  • జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) - అసోం
  • సురేశ్ సోనీ (సామాజిక కార్యకర్త - పేదల వైద్యుడు) - గుజరాత్
  • రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త) - ఉత్తరాఖండ్
  • పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్
  • లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర సమరయోధురాలు) - గోవా
  • గోకుల్ చంద్రదాస్ (కళలు) - పశ్చిమ బెంగాల్
  • సాల్లీ హోల్కర్ (చేనేత) - మధ్యప్రదేశ్
  • మారుతీ భుజరంగ్ రావు  (సాంస్కృతికం, విద్య) - మహారాష్ట్ర
  • బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) - రాజస్థాన్
  • వేలు ఆసన్ (డప్పు వాద్యకళాకారుడు) - తమిళనాడు
  • భీమవ్వ దొడ్డబాలప్ప శిల్యేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
  • పర్మార్ లవ్జీభాయ్ నాగ్జీబాయ్ (చేనేత) - గుజరాత్
  • విజయలక్ష్మి దేశ్ మానే (వైద్యం) - కర్ణాటక
  • చైత్రం దేవ్ చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) - మహారాష్ట్ర
  • జగదీశ్ జోషిలా (సాహిత్యం) - మధ్యప్రదేశ్
  • నీర్జా భట్లా (గైనకాలజిస్ట్) - ఢిల్లీ
  • హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య-ట్రావెల్) - ఉత్తరాఖండ్

  • Loading...

More Telugu News