Rajahmundry: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

Pillars collapsed in Rajahmundry airport

  • నూతన టెర్మినల్ భవనంలో కుప్పకూలిన కొంత భాగం
  • ఆ సమయంలో కార్మికులు అక్కడ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఇటీవలే భవన నిర్మాణాలను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు

రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్పకూలింది. పిల్లర్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు కొంత దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  

మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. నాణ్యతాలోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవక ముందే టెర్మినల్ భవనం పిల్లర్లు కుప్పకూలాయి.  

  • Loading...

More Telugu News