Team India: తొలి టీ20: ఇంగ్లండ్ ను మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా

Team India restricts England for 132 runs

  • టీమిండియా-ఇంగ్లండ్ తొలి టీ20
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మరెవ్వరూ రాణించలేదు. బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. యువ సంచలనం హ్యారీ బ్రూక్ 17, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3, అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. 

అనంతరం, 133 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా 7 ఓవర్ల అనంతరం 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన సంజు శాంసన్ తొలి వికెట్ రూపంలో అవుటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు జోఫ్రా అర్చర్ కు దక్కాయి. 

ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అభిషేక్ శర్మ (29 బ్యాటింగ్), తిలక్ వర్మ (7 బ్యాటింగ్) ఉన్నారు. అభిషేక్ శర్మ 2 ఫోర్లు, 3 సిక్సులు బాది మాంచి ఊపుమీదున్నాడు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 78 బంతుల్లో 66 పరుగులు చేయాలి.

Team India
England
1st T20
Eden Gardens
Kolkata
  • Loading...

More Telugu News