Governor: గవర్నర్ ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన గవర్నర్ కార్యాలయం

Governor Prathibha puraskar announced

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని గవర్నర్ నిర్ణయం
  • ఈ నెల 26న పురస్కారాలు అందించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • పురస్కార గ్రహీతల్లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సహా పలువురు

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నాలుగు రంగాలకు చెందిన వారికి పురస్కారాలు అందించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం అవార్డుకు ఎంపికైన ఎనిమిది మందితో కూడిన జాబితాను గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ పురస్కారాలను అందించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాలలో గత ఐదేళ్ళుగా సేవలు అందిస్తున్న వారికి ప్రతిభా పురస్కారాలను అందిస్తారు.

అవార్డు కింద రూ.2 లక్షలతో పాటు జ్ఞాపికను అందిస్తారు. అవార్డుకు ఎంపికైన వారిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజీ దీప్తి, ప్రొఫెసర్ ఎం.పాండురంగరావు-పీ.బీ.కృష్ణభారతికి సంయుక్తంగా, ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్‌ను ఎంపిక చేశారు.

Governor
Telangana
Republic Day
  • Loading...

More Telugu News