Nara Lokesh: దావోస్ బయలుదేరిన మంత్రి నారా లోకేశ్!

Minister Nara Lokesh left for Davos

  • యువతకు ఉద్యోగాలు, భారీ పెట్టుబడులే లక్ష్యం
  • దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేశ్  

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడులు, ఉపాధికల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి ముంబయి నుంచి దావోస్ పయనమయ్యారు. ఈనెల 20నుంచి 24వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జ్యురిచ్ కాలమానం ప్రకారం 20-1-25 ఉదయం 6.10గంటలకు స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ లో ల్యాండ్ అవుతారు. ఉదయం 10గంటలకు జ్యురిచ్ లోని హోటల్ హిల్డన్ లో స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అవుతారు. 10.20 నుంచి 11గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పరిశ్రమ పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 11.00గంటలకు స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు గ్లోబల్ అడ్వయిజర్ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతారు. 11.40గంటలకు ముఖ్యమంత్రితో కలసి తెలుగు డయాస్పోరా ఆధ్వర్యాన నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30గంటలకు జ్యురిచ్ నుంచి దావోస్ బయలుదేరి వెళతారు. రాత్రి 7.15గంటలకు దావోస్ ప్లీనరీ హాల్ లాబీలో ముఖ్యమంత్రితో కలిసి గ్లోబల్ పారిశ్రామికవేత్తల నెట్ వర్కింగ్ డిన్నర్ కు హాజరై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. రాత్రి 8.30 గంటలకు ప్రపంచ ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్ తో భేటీ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు.

అయిదురోజులపాటు జరిగే ఈ  సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం  (World Economic Forum) వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై  విద్యారంగ గవర్నర్ల సమావేశం (Educarion Governors meeting) లో పాల్గొంటారు. ఇంటిలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం (Building the Ecosystem for Intelligent Industries), అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం (AI energy impact), జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ (Gender parity Sprint Champions) అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్ట్స్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎకనామీ స్థితిగతులు - లేబర్ మార్కెట్ పై ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావం (The Transmission impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై వైట్ షీల్డ్ తో, భవిష్యత్తు వాతావరణ ఉద్యమ ప్రభావంపై (What does the future hold for climate movement) అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో, వార్షిక లీడర్ ఫోరమ్ పునరుద్దరణ (Renew Annual Leader Forum)పై నిర్వహించే  సమావేశాలకు మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. 

ప్రత్యేకించి దావోస్ లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏపీ పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, పెట్టుబడులకు మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ఏపీలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరిస్తారు. సి.ఎన్.బి.సి – టి.వి 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. భారత్ – డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతోపాటు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సి.ఐ.ఐ) నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేశ్ అతిధిగా హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేశ్ వైపు పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News