Sankranti Celebrations: కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు... ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన చిరంజీవి

- ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సందడి
- ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ... ప్రత్యేక అతిథిగా చిరంజీవి
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఈ సాయంత్రం సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా, చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సంబరాలకు కేంద్రమంత్రులు, పీవీ సింధు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి వంటి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా, ప్రధాని మోదీతో కలిసి చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేశారు. కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఇక, సంక్రాంతి వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ గాయని సునీత తన పాటలతో అందరినీ అలరించారు.