Stock Market: వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses for second straight day
  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు
  • 528 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 162 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఐటీ, ఫైనాన్షియల్ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 528 పాయింట్లు నష్టపోయి 77,620కి దిగజారింది. నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.87%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.50%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.38%), కొటక్ బ్యాంక్ (1.26%), ఏషియన్ పెయింట్ (0.69%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.07%), జొమాటో (-1.92%), ఎల్ అండ్ టీ (-1.88%), టాటా మోటార్స్ (-1.86%), అదానీ పోర్ట్స్ (-1.78%).
Stock Market
Sensex
Nifty

More Telugu News