Tragedy: వారానికి రూ. 200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య

Tragedy Couple Committed Suicide In Bhupalapally

  • భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో విషాదం
  • ఫైనాన్సర్ నుంచి ఒత్తిడి పెరగడంతో భార్య మనస్తాపం
  • గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆందోళనతో ఉరి వేసుకున్న భర్త.. భార్య కూడా మృతి 

తీసుకున్న అప్పుకు ప్రతివారం చెల్లించాల్సిన రూ. 200 కూడా కట్టలేక ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) భార్యాభర్తలు. వీరికి రిషి (14), జశ్వంత్ (12) అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. దేవేందర్, చందన ఇద్దరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామంలోని మహిళలు ఓ గ్రూపుగా ఏర్పడి ఓ ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారి వద్ద రూ. 2.50 లక్షల అప్పు తీసుకున్నారు. దీనికి చందన వంతుగా ప్రతి వారం రూ. 200 చెల్లించాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా చెల్లించినా ఇటీవల భర్త, పిల్లలు అనారోగ్యం బారినపడడంతో కిస్తీలు కట్టడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఫైనాన్స్ వ్యాపారి నుంచి ఒత్తిడి పెరిగింది. 

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చందన డిసెంబర్ 6న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న భార్య పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరివేసుకున్నాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన నిన్న మృతి చెందింది. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tragedy
Jayashankar Bhupalpally District
Telangana
  • Loading...

More Telugu News