Nadendla Manohar: పేర్ని జయసుధ గోడౌన్ లో 3 వేల బస్తాలు కాదు... 4,840 బస్తాలు మాయం: మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar press meet on rice issue

  • తెనాలిలో నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్
  • జేఎస్ గోడౌన్ లో బియ్యం మాయంపై లోతుగా విచారణ చేస్తున్నట్టు వెల్లడి
  • రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పి.డి.యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరిక

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. 

మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్ లో 3 వేల బస్తాలు కాదు... 4840 బస్తాలు మాయం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి... ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందుపెడతామని అన్నారు.

ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం

అసలు జేఎస్ గోడౌన్స్ లో స్టాక్ ఎంత ఉంది...? అనే సమాచారాన్ని స్టాక్ రిజిస్టర్ బట్టి ప్రాథమిక సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ నుంచి డిసెంబర్ 4వ తేదీన తెప్పించుకున్నాం. డిసెంబర్ 10న  సివిల్ సప్లైస్ ఎండీ చట్టప్రకారం డబుల్ పెనాల్టీ వేయాలని, జేఎస్ గోడౌన్ ను బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రిజిస్టర్ ట్యాంపర్ చేసే ప్రయత్నం 

వేబ్రిడ్జ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పొరపాటున స్టాక్ తగ్గింది అని జేఎస్ యాజమాన్యం చెబుతోంది. వీళ్లు మరిచిపోయారో... లేక విచారణలో బయటకు రాదని అనుకుంటున్నారో కానీ... విచారణలో అన్నీ బయటికి వస్తాయి. పక్కనే ఉన్న సత్య వేర్ హౌస్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందనిగానీ, స్టాక్ తగ్గిందని చెప్పలేదు. 

స్టాక్ రిజిస్టర్, లారీ వేబ్రిడ్జ్ ను ట్యాంపర్ చేసి ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అందిన రిపోర్టు ప్రకారం 243 మెట్రిక్ టన్నులు అంటే 4840 బస్తాలు తగ్గాయని నిర్ధారణ అయ్యింది. జేఎస్ గోడౌన్ 2021లో పౌర  సరఫరాల శాఖకు అప్పగించారు. అటువంటి గోడౌన్ లో  243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దారి మళ్లించారు. లెక్కలతో సబంధం లేకుండా ప్రజల సొమ్ము స్వలాభం కోసం దారి మళ్లించారు... అని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

Nadendla Manohar
Perni Nani
Perni Jayasudha
Rice
Janasena
TDP-JanaSena-BJP Alliance
YSRCP
  • Loading...

More Telugu News