Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం .. నలుగురు దుర్మరణం

road accident in palnadu dist

  • పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో గీతికా స్కూల్ వద్ద చెట్టును ఢీకొట్టిన కారు
  • ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి
  • మృతులు నెల్లూరుకు చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తింపు
  • తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై గీతికా స్కూల్ వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరు కొత్త కారుకు పూజలు చేయించేందుకు కొండగట్టుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా దుర్ఘటన జరిగింది.  

Road Accident
palnadu dist
Andhra Pradesh
  • Loading...

More Telugu News